లౌకిక నీతి కథలు, చట్ట గ్రంథాలు మరియు పురాణాల తుది రూపకల్పనలో గుప్తుల కాలం అత్యంత కీలక పాత్ర పోషించింది.
- విష్ణుశర్మ - పంచతంత్రం:
- అమరశక్తి మహారాజు యొక్క అజ్ఞానులైన కుమారులకు రాజనీతి, లౌకిక జ్ఞానాన్ని బోధించడానికి విష్ణుశర్మ జంతువుల పాత్రలతో 'పంచతంత్రం' నీతి కథలను రచించాడు.
- బైబిల్ తర్వాత ప్రపంచంలో అత్యధిక భాషల్లోకి అనువదించబడిన గ్రంథంగా పంచతంత్రం చరిత్ర సృష్టించింది (పర్షియన్ భాషలోకి 'కలీలా-వా-దిమ్నా'గా అనువదించబడింది).
- పురాణాలు మరియు ఇతిహాసాల తుది సంకలనం:
- రామాయణం, మహాభారతం ఇతిహాసాలు మరియు 18 ప్రధాన పురాణాలు ప్రస్తుత రూపంలో తుది సంకలనం (Final Compilation) చేయబడింది గుప్తుల కాలంలోనే.
- ధర్మశాస్త్రాలు మరియు కామసూత్రాలు:
- నారద స్మృతి, బృహస్పతి స్మృతి, కాత్యాయన స్మృతులు రచించబడి పౌర మరియు క్రిమినల్ చట్టాల విభజన స్పష్టమైంది.
- వాత్సాయనుడు ప్రసిద్ధ లైంగిక, సాంఘిక జీవన గ్రంథమైన 'కామసూత్ర'ను రచించాడు.
- కామందకుడు చాణక్యుని అర్థశాస్త్రం ఆధారంగా 'నీతిసార' అనే రాజకీయ గ్రంథాన్ని రచించాడు.
