రసాయన శాస్త్రం, లోహ సంగ్రహణ మరియు వైద్య రంగాలలో గుప్తుల కాలం సాధించిన ప్రగతికి దృష్టాంతాలు నేటికీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
- వైద్య శాస్త్ర ప్రగతి:
- నవరత్నాలలో ఒకరైన ధన్వంతరిని ఆయుర్వేదానికి ప్రతినిధిగా భావిస్తారు.
- 'నవనీతకం' (రసాయనాలు, లేహ్యాలు, ఔషధాల తయారీ గ్రంథం) ఈ కాలంలోనే వెలువడింది.
- వాగ్భటుడు ఆయుర్వేద ప్రసిద్ధ గ్రంథమైన 'అష్టాంగ సంగ్రహం' మరియు 'అష్టాంగ హృదయం' రచించాడు.
- సుశ్రుత సంహిత ఈ కాలంలో సవరించబడి శస్త్రచికిత్స (Surgery) పద్ధతులు విస్తరించాయి.
- పాలకాప్యుడు ఏనుగుల చికిత్సపై 'హస్త్యాయుర్వేదం' గ్రంథాన్ని రచించాడు.
- మెహ్రౌలీ ఇనుప స్తంభం (ఢిల్లీ - రసాయన కళాఖండం):
- ఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్న 23 అడుగుల ఎత్తు, 6 టన్నుల బరువున్న మెహ్రౌలీ ఇనుప స్తంభం (Iron Pillar) గుప్తుల నాటి లోహ సాంకేతికతకు నిదర్శనం.
- దీనిపై 'చంద్ర' అనే రాజు (రెండవ చంద్రగుప్తుడు) విజయాలు సంస్కృతంలో చెక్కబడి ఉన్నాయి.
- 1600 సంవత్సరాలుగా ఎండకు, వానకు బహిరంగంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఏమాత్రం తుప్పు పట్టకపోవడం (Rustless) ప్రాచీన భారతీయ రసాయన శాస్త్ర నైపుణ్యానికి తిరుగులేని నిదర్శనం.
