మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతాన్ని ధారా నగరం రాజధానిగా చేసుకుని పాలించినవారు పరమారులు. వీరిలో రాజా భోజుడు సాహిత్య సమరాంగణ సార్వభౌముడు.
- వంశ స్థాపన:
- పరమార వంశాన్ని ఉపేంద్రుడు (కృష్ణరాజు) స్థాపించాడు.
- సియాకుడు, వాక్పతి ముంజ ఈ వంశంలో తొలి ప్రముఖ యోధులు.
- రాజా భోజుడు (క్రీ.శ. 1010 - 1055):
- పరమార వంశంలో అత్యున్నత చక్రవర్తి మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి.
- భోపాల్ నగర సమీపంలో 'భోజసముద్రం' (భోజ్పూర్ సరస్సు) అనే భారీ జలాశయాన్ని నిర్మించాడు.
- భోజ్పూర్లో భారీ శివలింగం గల సుందర భోజేశ్వర ఆలయాన్ని నిర్మించాడు.
- సరస్వతీ కంఠాభరణం మరియు భోజశాల:
- రాజధాని ధారానగరంలో విద్యాపీఠంగా 'భోజశాల' అనే సరస్వతీ దేవి ఆలయ సంస్కృత కళాశాలను స్థాపించాడు.
- స్వయంగా గొప్ప కవి, పండితుడైన రాజా భోజునికి 'కవిరాజ' బిరుదు ఉంది.
- రాజా భోజుని ముఖ్య రచనలు: 'సమరాంగణ సూత్రధార' (వాస్తు మరియు యంత్ర శాస్త్రం), 'సరస్వతీ కంఠాభరణం' (వ్యాకరణం, కవిత్వం), 'ఆయుర్వేద సర్వస్వం' (వైద్యం), 'యుక్తికల్పతరు' (నౌకా నిర్మాణం).
