ఆగ్రా నుండి తిరిగి వచ్చిన తర్వాత శివాజీ కోల్పోయిన కోటలన్నింటినీ తిరిగి గెలుచుకుని స్వతంత్ర సామ్రాజ్యాన్ని ప్రకటించాడు.
- రాయ్గఢ్ పట్టాభిషేకం (1674):
- 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలో శివాజీ ఘనంగా పట్టాభిషేకం చేసుకున్నాడు.
- వారణాసికి చెందిన ప్రముఖ పండితుడు గాగాభట్టు ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించాడు.
- శివాజీ 'ఛత్రపతి' (సార్వభౌముడు), 'హైందవ ధర్మోద్ధారక' మరియు 'గోబ్రాహ్మణ ప్రతిపాలక' బిరుదులను స్వీకరించాడు.
- రాయ్గఢ్ను తన రాజధానిగా ప్రకటించుకుని కొత్త శకాన్ని ప్రారంభించాడు.
- దక్షిణ లేదా కర్ణాటక దండయాత్ర (1677 - 1678):
- గోల్కొండ కుతుబ్షాహీ సుల్తాన్ అబుల్ హసన్ తానీషాతో శివాజీ స్నేహ ఒప్పందం చేసుకున్నాడు.
- జింజీ, వెల్లూరు, తంజావూరు ప్రాంతాలను జయించి మరాఠా రాజ్యంలో కలిపాడు.
- జింజీ కోట తర్వాతి కాలంలో మరాఠాల అత్యవసర రక్షణ స్థావరంగా మారింది.
- శివాజీ 1680 ఏప్రిల్లో రాయ్గఢ్ కోటలో అనారోగ్యంతో మరణించాడు.
