← All topic notes

శుంగ వంశం - పుష్యమిత్ర శుంగుడు

By exambadi.inNote 02 / 19

చివరి మౌర్య చక్రవర్తి బృహద్రథుడిని సంహరించి పుష్యమిత్ర శుంగుడు క్రీ.పూ. 185 లో శుంగ వంశాన్ని స్థాపించాడు.

  • పుష్యమిత్ర శుంగుని పాలన:
    1. పుష్యమిత్రుడు మౌర్యుల వద్ద ప్రధాన సేనానిగా పనిచేశాడు.
    2. ఇతడు బ్రాహ్మణ మతాన్ని తిరిగి పునరుద్ధరించాడు.
    3. తన సార్వభౌమాధికారాన్ని చాటడానికి రెండు అశ్వమేధ యాగాలను నిర్వహించాడు.
    4. ఈ యజ్ఞాలను ప్రసిద్ధ సంస్కృత పండితుడు పతంజలి మహర్షి దగ్గరుండి జరిపించాడు.
  • రాజధాని మరియు దండయాత్రలు:
    1. వీరి ప్రధాన రాజధాని పాటలీపుత్రం; రెండవ రాజధాని విదిశ (మధ్యప్రదేశ్).
    2. గ్రీకు దండయాత్రలను పుష్యమిత్రుడు మరియు అతని మనవడు వసుమిత్రుడు తిప్పికొట్టారు.
    3. అయోధ్య శాసనం పుష్యమిత్రుడు చేసిన అశ్వమేధ యాగాల గురించి స్పష్టంగా తెలుపుతుంది.