శుంగుల తర్వాత మగధను కాణ్వులు పాలించగా, తీరప్రాంత ఒడిశాలో చేది వంశం బలపడింది.
- కాణ్ణ వంశం (క్రీ.పూ. 73 - క్రీ.పూ. 28):
- వాసుదేవ కాణ్వుడు ఈ వంశాన్ని స్థాపించాడు.
- వీరు కూడా బ్రాహ్మణ వంశానికి చెందినవారే.
- ఈ వంశంలో నలుగురు రాజులు (వాసుదేవుడు, భూమిమిత్రుడు, నారాయణుడు, సుశర్మన్) మాత్రమే 45 ఏళ్లు పాలించారు.
- చివరి కాణ్ణ రాజు సుశర్మన్ను శాతవాహన రాజు హతమార్చాడు.
- చేది వంశం - కళింగ ఖారవేలుడు:
- ఒడిశాలోని కళింగ ప్రాంతాన్ని చేది (మహామేఘవాహన) వంశం పాలించింది.
- ఈ వంశంలో అత్యంత పరాక్రమవంతుడైన రాజు ఖారవేలుడు.
- ఖారవేలుడు జైన మతాన్ని తీవ్రంగా ఆదరించి పోషించాడు.
- హాథీగుంఫా శాసనం:
- భువనేశ్వర్ సమీపంలోని ఉదయగిరి కొండల్లో ఖారవేలుడు 'హాథీగుంఫా శాసనాన్ని' ప్రాకృత భాషలో వేయించాడు.
- ఈ శాసనం ఖారవేలుని 13 ఏళ్ల పరిపాలనా విజయాలను వరుసగా వివరిస్తుంది.
- శాతవాహన రాజు మొదటి శాతకర్ణిని, మగధ పాలకుడు బహసతిమిత్రుడిని ఖారవేలుడు ఓడించినట్లు ఇది చెబుతుంది.
