← All topic notes

పల్లవుల వాస్తుశిల్పం - రాతి గుహల నుండి తీర దేవాలయాల వరకు

By exambadi.inNote 04 / 20

దక్షిణ భారతదేశంలో ద్రావిడ ఆలయ నిర్మాణ శైలికి దృఢమైన పునాది వేసినవారు పల్లవులు. వీరి కళ నాలుగు దశల్లో వికసించింది.

  • మహేంద్ర శైలి (తొలి దశ):
    1. కొండలను తొలిచి రాతి గుహాలయాలను (Rock-cut caves) నిర్మించారు.
    2. మండగపట్టు, పల్లవరం, తిరుచిరాపల్లిలలో ఇటువంటి గుహాలయాలు కనిపిస్తాయి.
  • మామల్ల శైలి (రెండవ దశ):
    1. గుహాలయాలతో పాటు విశాలమైన మండపాలు మరియు ఏకశిలా రథాలను నిర్మించారు.
    2. మహాబలిపురంలోని పంచపాండవ రథాలు (ధర్మరాజు, భీమ, అర్జున, నకుల-సహదేవ, ద్రౌపది రథాలు) ఏకశిలలో మలిచిన అద్భుతాలు.
    3. వీటిలో ధర్మరాజ రథం అతిపెద్దది, ద్రౌపది రథం అతి చిన్నది.
    4. 'భగీరథుని తపస్సు' లేదా 'గంగావతరణం' అనే ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ రాతి శిల్పం ఇక్కడే ఉంది.
  • రాజసింహ శైలి (మూడవ దశ):
    1. కొండలను తొలిచే పద్ధతికి స్వస్తి పలికి శాశ్వత రాతి దేవాలయాల (Structural temples) నిర్మాణం ప్రారంభించారు.
    2. రెండవ నరసింహవర్మన్ (రాజసింహుడు) మహాబలిపురంలో ప్రసిద్ధ 'తీర దేవాలయం' (Shore Temple) నిర్మించాడు.
    3. కాంచీపురంలోని ప్రఖ్యాత 'కైలాసనాథ దేవాలయం' కూడా రాజసింహ శైలిలోనే నిర్మితమైంది.
  • అపరాజిత శైలి (నాల్గవ దశ):
    1. కాంచీపురంలోని వైకుంఠ పెరుమాళ్ దేవాలయం (రెండవ నందివర్మన్ కాలం) ఈ శైలికి చెందినది.