మొఘల్ సామ్రాజ్యంలో వర్తక రాయితీలు పొందడానికి బ్రిటిష్ రాజు మొదటి జేమ్స్ మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి రాయబారులను పంపాడు.
- కెప్టెన్ విలియం హాకిన్స్ (1608 - 1609):
- హాకిన్స్ 'హెక్టర్' అనే నౌకలో 1608లో సూరత్ చేరుకున్నాడు.
- 1609లో ఆగ్రాలోని జహంగీర్ దర్బార్కు వెళ్లి మొదటి జేమ్స్ రాసిన లేఖను సమర్పించాడు.
- హాకిన్స్ టర్కిష్, పర్షియన్ భాషలు అనర్గళంగా మాట్లాడటంతో జహంగీర్ ముగ్ధుడయ్యాడు.
- జహంగీర్ అతనికి 'ఇంగ్లీష్ ఖాన్' అనే బిరుదు మరియు 400 జాట్ మన్సబ్దారీ హోదా ఇచ్చాడు.
- అయితే పోర్చుగీసు వారి ఒత్తిడి వల్ల సూరత్లో ఫ్యాక్టరీ కట్టడానికి జహంగీర్ వెంటనే శాశ్వత అనుమతి ఇవ్వలేదు.
- సర్ థామస్ రో (1615 - 1619):
- 1615లో మొదటి జేమ్స్ అధికారిక రాయబారిగా సర్ థామస్ రో అజ్మీర్లో జహంగీర్ను కలిశాడు.
- తన దౌత్య నైపుణ్యంతో మొఘల్ సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలలో ఫ్యాక్టరీలు నిర్మించుకోవడానికి శాశ్వత ఫర్మానాను సాధించాడు.
