← All topic notes

పోర్చుగీసు గవర్నర్లు - అల్మేడా మరియు అల్బుకెర్క్

By exambadi.inNote 04 / 21

భారతదేశంలో పోర్చుగీసు అధికారాన్ని సుస్థిరం చేయడానికి పోర్చుగల్ ప్రభుత్వం గవర్నర్లను నియమించింది.

  • ఫ్రాన్సిస్కో డి అల్మేడా (1505 - 1509):
    1. ఈయన భారతదేశంలో మొదటి పోర్చుగీసు గవర్నర్.
    2. ఈయన 'బ్లూ వాటర్ పాలసీ' (నీలి నీటి విధానం లేదా శాంత సముద్ర విధానం)ని ప్రవేశపెట్టాడు.
    3. భూభాగాలను ఆక్రమించడం కంటే హిందూ మహాసముద్రంపై పూర్తి నావికా ఆధిపత్యం సాధించడమే దీని ముఖ్య ఉద్దేశం.
    4. డయ్యూ యుద్ధంలో (1509) ఈజిప్ట్, గుజరాత్ సంయుక్త నావికాదళాన్ని అల్మేడా ఓడించాడు.
  • అల్ఫోన్సో డి అల్బుకెర్క్ (1509 - 1515):
    1. ఈయన్ను భారతదేశంలో పోర్చుగీసు అధికారానికి నిజమైన వ్యవస్థాపకుడు అంటారు.
    2. 1510లో బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షా నుండి గోవాను స్వాధీనం చేసుకున్నాడు.
    3. భారతీయులతో వివాహ సంబంధాలు పెట్టుకోవాలని పోర్చుగీసు పురుషులను ప్రోత్సహించాడు.
    4. తన పాలనా ప్రాంతంలో సతీసహగమనాన్ని నిషేధించాడు.