తూర్పు దేశాలతో వాణిజ్యం చేయడం కోసం లండన్ వర్తకులు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సంస్థే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ.
- కంపెనీ ఏర్పాటు (1600):
- 1599లో లండన్ వ్యాపారులు 'మర్చంట్ అడ్వెంచరర్స్' పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
- 1600 డిసెంబర్ 31న బ్రిటన్ రాణి ఎలిజబెత్-1 ఈ కంపెనీకి అధికారిక రాయల్ చార్టర్ మంజూరు చేసింది.
- ప్రారంభంలో తూర్పు దేశాలతో 15 సంవత్సరాల పాటు వాణిజ్యం చేసుకోవడానికి ప్రత్యేక గుత్తాధిపత్యాన్ని (Monopoly) ఇచ్చారు.
- కంపెనీ అసలు పేరు: 'గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటు ది ఈస్ట్ ఇండీస్'.
- మొదటి సముద్ర యాత్రలు:
- జేమ్స్ లాంకాస్టర్ నాయకత్వంలో మొదటి యాత్ర సుమత్రా, ఇండోనేషియా వైపు సాగింది.
- అప్పటి ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ భారతదేశ మొఘల్ చక్రవర్తికి రాయబారులను పంపాలని నిర్ణయించాడు.
