← All topic notes

నినో డా కున్హా మరియు పోర్చుగీసు వర్తక స్థావరాలు

By exambadi.inNote 05 / 21

అల్బుకెర్క్ తర్వాత వచ్చిన గవర్నర్లలో నినో డా కున్హా అత్యంత ముఖ్యమైనవాడు. ఈయన కాలంలో పోర్చుగీసు రాజధాని మారింది.

  • రాజధాని మార్పు (1530):
    1. 1530లో నినో డా కున్హా పోర్చుగీసు ప్రధాన కార్యాలయాన్ని కొచ్చిన్ నుండి గోవాకు మార్చాడు.
    2. అప్పటి నుండి 1961 వరకు గోవానే పోర్చుగీసు వారికి ప్రధాన రాజధానిగా నిలిచింది.
  • ప్రాంతాల ఆక్రమణ:
    1. గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుండి బేసిన్ (1534), డయ్యూ (1535) ప్రాంతాలను పొందాడు.
    2. సముద్రంలో బహదూర్ షాతో జరిగిన చర్చల్లో వివాదం వచ్చి బహదూర్ షా నీటిలో మునిగి చనిపోయాడు.
  • ప్రధాన పోర్చుగీసు స్థావరాలు:
    1. పశ్చిమ తీరంలో: గోవా, డామన్, డయ్యూ, బేసిన్, సాల్సెట్, బాంబే, మంగళూరు.
    2. తూర్పు తీరంలో: శాంథోమ్ (మద్రాస్ సమీపం), నాగపట్టణం.
    3. బెంగాల్‌లో: హుగ్లీ వీరి ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మారింది.