భారత ఉపఖండంలో మొట్టమొదటి పట్టణ నాగరికతగా వెలుగొందిన హరప్పా సంస్కృతి క్రీ.పూ. 3వ సహస్రాబ్దిలో విలసిల్లింది. ఆర్కియాలజీ సంప్రదాయం ప్రకారం మొదట కనుగొనబడిన స్థావరం పేరిట దీనిని 'హరప్పా నాగరికత' అని పిలుస్తారు.
- నామకరణం మరియు కాలనిర్ణయం:
- 'ఇండస్ సివిలైజేషన్' (సింధు నాగరికత) అనే పదాన్ని పరిశోధనల్లో మొదటిసారిగా సర్ జాన్ మార్షల్ ఉపయోగించారు.
- ఇది కాంస్య యుగానికి (Bronze Age) మరియు లిపి ఉండి చదవడానికి వీలుకాని ప్రోటో-హిస్టారిక్ కాలానికి చెందినది.
- డి.పి. అగర్వాల్ రేడియో కార్బన్-14 (C-14) డేటింగ్ ఆధారంగా దీని ప్రామాణిక కాలం క్రీ.పూ. 2500 నుండి క్రీ.పూ. 1750 మధ్య స్థిరపరచబడింది.
- భౌగోళిక సరిహద్దులు (సుమారు 13 లక్షల చ.కి.మీ. త్రిభుజాకార విస్తీర్ణం):
- ఉత్తర సరిహద్దు: జమ్మూ కాశ్మీర్లోని మాండా (చీనాబ్ నది ఒడ్డున).
- దక్షిణ సరిహద్దు: మహారాష్ట్రలోని దైమాబాద్ (ప్రవర/గోదావరి ఉపనది ఒడ్డున).
- తూర్పు సరిహద్దు: ఉత్తరప్రదేశ్లోని ఆలంగీర్పూర్ (హిండన్ నది ఒడ్డున).
- పశ్చిమ సరిహద్దు: పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దులోని సుత్కాజెండోర్ (దాష్క్ నది ఒడ్డున, మక్రాన్ తీరం).
- ఆఫ్ఘనిస్తాన్లో షోర్టుఘై, ముండిగాక్ అనే వాణిజ్య స్థావరాలు ఉన్నాయి.
- సింధు-సరస్వతి అక్షం:
- ఈ నాగరికతకు చెందిన దాదాపు 80% స్థావరాలు సరస్వతి (ఘగ్గర్-హక్రా) నదీ పరీవాహక ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి.
