హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి పునరుద్ధరణ ఉద్యమాలు వచ్చాయి. దయానంద సరస్వతి (మూలశంకర్) 1875లో బొంబాయిలో 'ఆర్యసమాజాన్ని' స్థాపించాడు. 'వేదాలకు తరలిపొండి' (Go Back to Vedas) అని పిలుపునిచ్చాడు; ఇతని ప్రధాన గ్రంథం 'సత్యార్థ ప్రకాశం'.
విదేశీ మతాల్లోకి మారిన వారిని తిరిగి హిందూమతంలోకి తీసుకురావడానికి 'శుద్ధి ఉద్యమాన్ని' ప్రారంభించాడు. 'స్వరాజ్యం' అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఇతడే.
రామకృష్ణ పరమహంస బోధనల ఆధారంగా ఆయన శిష్యుడు స్వామి వివేకానంద (నరేంద్రనాథ్ దత్) 1897లో 'రామకృష్ణ మిషన్'ను స్థాపించాడు (మానవ సేవే మాధవ సేవ).
1893లో చికాగో ప్రపంచ సర్వమత మహాసభలలో వివేకానంద చేసిన ప్రసంగం హిందూ తత్వశాస్త్ర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటింది; ఆయన యువతలో జాతీయవాదాన్ని రగిల్చాడు.
