1920 నాగ్పూర్ సమావేశం ఆమోదంతో గాంధీజీ 'సహాయ నిరాకరణ ఉద్యమాన్ని' ప్రారంభించారు.
బిరుదులు వదులుకోవడం, విదేశీ వస్త్రాల దహనం, న్యాయస్థానాలు-పాఠశాలల బహిష్కరణ చేపట్టారు; అయితే 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్లో జరిగిన 'చౌరీచౌరా హింసాత్మక ఘటన' (22 మంది పోలీసుల సజీవ దహనం)తో గాంధీజీ ఉద్యమాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు (దీని అసంతృప్తితో చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ 1923లో 'స్వరాజ్ పార్టీ'ని స్థాపించారు).
అనంతరం 1929 లాహోర్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 'పూర్ణ స్వరాజ్' తీర్మానం చేశారు (1930 జనవరి 26ను తొలి స్వాతంత్ర్య దినంగా జరిపారు).
గాంధీజీ 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుండి 78 మంది అనుచరులతో 240 మైళ్లు పాదయాత్ర చేసి ఏప్రిల్ 6న తీర గ్రామం దండి వద్ద ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి 'శాసనోల్లంఘన ఉద్యమాన్ని' (ఉప్పు సత్యాగ్రహం) ప్రారంభించారు.
సరోజినీ నాయుడు ధరాసన ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు.
