మౌర్యుల పాలన ప్రాచీన భారతదేశంలోనే అత్యంత విస్తృతమైన కేంద్రీకృత అధికార యంత్రాంగం (Centralized Bureaucracy). రాజు సర్వోన్నత అధిపతి. రాజుకు సహాయపడటానికి 'మంత్రి పరిషత్' ఉండేది.
పరిపాలనలో అగ్రశ్రేణి అధికారులను 'తీర్థులు' (మొత్తం 18 మంది) అనేవారు; వీరిలో ప్రధానమంత్రి, పురోహితుడు, సేనాపతి, యువరాజు ముఖ్యులు.
వివిధ శాఖల కార్యనిర్వాహక అధిపతులను 'అధ్యక్షులు' (27 మంది) అనేవారు; ఉదాహరణకు సీతాధ్యక్ష (వ్యవసాయం), పణ్యాధ్యక్ష (వాణిజ్యం), లక్ష్మణాధ్యక్ష (టంకసాల), పోతవాధ్యక్ష (తూనికలు-కొలతలు).
