మహావీరుడు పార్శ్వనాథుని నాలుగు వ్రతాలకు ఐదవదైన 'బ్రహ్మచర్యం' జోడించి 'పంచ మహావ్రతాలు'గా రూపొందించాడు: 1. అహింస (పరమ ధర్మం) 2. సత్యం 3. అస్తేయం (దొంగతనం చేయకపోవడం) 4. అపరిగ్రహం (ఆస్తిపాస్తులు కూడబెట్టకపోవడం) 5. బ్రహ్మచర్యం.
మోక్ష సాధనకు 'త్రిరత్నాలు' నిర్దేశించాడు: సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ కర్మ/ప్రవర్తన. జైన తత్వశాస్త్రం 'అనేకాంతవాదం' (సత్యం బహుముఖమైనది) మరియు 'స్యాద్వాదం' (సాపేక్షతా జ్ఞాన సిద్ధాంతం) పునాదులపై ఆధారపడింది.
దేవుని ఉనికిని నిరాకరిస్తూనే, కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మను తీవ్రంగా విశ్వసించింది.
