క్రీ.పూ. 6వ శతాబ్దంలో వేద కర్మకాండలు, జంతుబలులు, బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన శ్రమణ ఉద్యమాలలో జైన మతం అగ్రగామి. జైన సంప్రదాయం ప్రకారం 24 మంది తీర్థంకరులు (భవసాగరాన్ని దాటించే మార్గదర్శకులు) ఉన్నారు.
మొదటి తీర్థంకరుడు రిషభనాథుడు (వృషభదేవుడు - చిహ్నం ఎద్దు); ఈయన ప్రస్తావన ఋగ్వేదం, భాగవత పురాణాల్లో కలదు. 22వ తీర్థంకరుడు అరిష్టనేమి (కృష్ణుని సమకాలికుడు).
23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు కాశీ యువరాజు; ఈయన అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం అనే నాలుగు వ్రతాలను (చాతుర్యామ ధర్మం) బోధించాడు.
