భారతదేశంలో శాశ్వత రాతి దేవాలయాల నిర్మాణం (నాగార శైలి) గుప్తుల కాలంలోనే ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్లోని దేవగఢ్ 'దశావతార దేవాలయం' తొలి శిఖర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది (శేషశాయి విష్ణు శిల్పం).
భితర్గావ్ (కాన్పూర్) ఇటుకలతో నిర్మించిన దేవాలయం. మహారాష్ట్రలోని అజంతా గుహలలో గుప్తుల కాలం నాటి ఫ్రెస్కో చిత్రాలు (16, 17వ గుహలు - మరణాసన్న రాకుమారి చిత్రం), బాగ్ గుహల (మధ్యప్రదేశ్) వర్ణచిత్రాలు అత్యున్నత కళాఖండాలు.
సుల్తాన్గంజ్ కాంస్య బుద్ధ విగ్రహం (7.5 అడుగులు) వీరి లోహకళకు నిదర్శనం.
