కుషాణుల పతనం తర్వాత ఉత్తర భారతదేశంలో రాజకీయ ఐక్యతను పునరుద్ధరించిన ఘనత గుప్తులదే. వంశ మూలపురుషుడు శ్రీగుప్తుడు (ఘటోత్కచుడు ఇతని కుమారుడు). మొదటి చంద్రగుప్తుడు (క్రీ.శ.
319 - 335) లిచ్ఛవి యువరాణి కుమారదేవిని వివాహం చేసుకుని ప్రతిష్టను పెంచుకున్నాడు; 'మహారాజాధిరాజ' బిరుదు ధరించి, క్రీ.శ. 319-320లో 'గుప్త శకం' ప్రారంభించాడు. ఈ దంపతుల చిత్రాలతో కూడిన బంగారు నాణేలను (చంద్రగుప్త-కుమారదేవి నాణేలు) జారీ చేశాడు.
