కుమారగుప్తుడు-1 (మహేంద్రాదిత్య) ప్రపంచ ప్రసిద్ధ నలంద బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.
స్కందగుప్తుడు మధ్య ఆసియా క్రూర తెగ అయిన హూణుల (తెల్ల హూణులు) దండయాత్రలను తిప్పికొట్టి సామ్రాజ్యాన్ని రక్షించాడు; జునాగఢ్ శాసనం ప్రకారం సుదర్శన తటాకాన్ని తిరిగి పునరుద్ధరించాడు. క్రీ.శ.
510 నాటి భానుగుప్తుని 'ఎరాన్ శిలాశాసనం' (మధ్యప్రదేశ్) భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా 'సతీసహగమనం' జరిగినట్లు లిఖితపూర్వక ఆధారాన్ని అందించింది.
