బిందుసారుని మరణానంతరం నాలుగేళ్ల అంతర్యుద్ధం ముగిశాక క్రీ.పూ. 269లో అశోకుడు మగధ సింహాసనాన్ని అధిష్టించాడు (సింహళ సంప్రదాయం ప్రకారం 99 మంది సోదరులను చంపినట్లు కథనం ఉన్నప్పటికీ చారిత్రక ఆధారాలు లేవు). తన పట్టాభిషేకమైన 8వ సంవత్సరంలో (క్రీ.పూ.
261) అశోకుడు వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన కళింగ (నేటి ఒడిశా) పై దండెత్తాడు. ఈ యుద్ధంలో లక్ష మంది సైనికులు చనిపోగా, లక్షన్నర మంది బందీలయ్యారు; దయా నదీ జలాలు రక్తసిక్తమయ్యాయి.
