కళింగ యుద్ధ భయానక మారణహోమాన్ని చూసి తీవ్ర పశ్చాత్తాపానికి గురైన అశోకుడు యుద్ధ మార్గాన్ని ('బేరీఘోష') శాశ్వతంగా విడనాడి, ధర్మ విజయ మార్గాన్ని ('ధమ్మఘోష') స్వీకరించాడు. ఉపగుప్తుని ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు.
అశోకుని 'ధమ్మం' అనేది ఏ ఒక్క నిర్దిష్ట మత సిద్ధాంతం కాదు; ఇది సార్వజనీన నైతిక ప్రవర్తనా నియమావళి. తల్లిదండ్రులను గౌరవించడం, గురువుల పట్ల వినయం, బానిసలు, సేవకుల పట్ల దయ, ప్రాణుల పట్ల అహింస, సర్వమత సహనం ధమ్మం యొక్క ముఖ్య సూత్రాలు.
