మహారాజా రంజిత్ సింగ్ (లాహోర్ పాలకుడు) బ్రతికి ఉన్నంతవరకు (1809 అమృత్సర్ సంధి) బ్రిటిష్ వారు పంజాబ్ను తాకలేకపోయారు.
ఆయన మరణానంతరం జరిగిన మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం (1845 - 1846, లాహోర్ సంధి) మరియు రెండవ ఆంగ్లో-సిక్కు యుద్ధం (1848 - 1849, గుజరాత్ యుద్ధం) ద్వారా లార్డ్ డల్హౌసీ పంజాబ్ను పూర్తిగా ఆక్రమించాడు; బాలరాజు దిలీప్ సింగ్ను ఇంగ్లాండ్కు పంపించి, జగత్ ప్రసిద్ధ 'కోహినూర్' వజ్రాన్ని విక్టోరియా రాణికి సమర్పించారు.
అలాగే మొదటి ఆంగ్లో-బర్మా యుద్ధం (1824-26, యాండబూ సంధి), రెండవ బర్మా యుద్ధం (1852) ద్వారా బర్మాను; 1843లో చార్లెస్ నేపియర్ ద్వారా సింధు ప్రాంతాన్ని కంపెనీ అనైతికంగా ఆక్రమించింది ('సింధును స్వాధీనం చేసుకోవడం ఓ ఉపయోగకరమైన దొంగతనం' అని నేపియర్ వ్యాఖ్యానించాడు).
