గాంధీజీ నాయకత్వంలో సమావేశాల స్వభావం ప్రజా ఉద్యమంగా మారింది: 1. 1920 ప్రత్యేక కలకత్తా సమావేశం (లాలా లజపత్రాయ్) మరియు రెగ్యులర్ నాగ్పూర్ సమావేశం (సి.
విజయరాఘవాచారియార్): సహాయ నిరాకరణోద్యమానికి ఆమోదం ముద్ర వేయబడింది, కాంగ్రెస్ సభ్యత్వ రుసుము 4 అణాలకు తగ్గించబడింది. 2. 1924 బెల్గాం సమావేశం: మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సమావేశం ఇది. 3.
1925 కాన్పూర్ సమావేశం: సరోజినీ నాయుడు అధ్యక్షత వహించారు (కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ; కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు 1917 కలకత్తాలో అనిబిసెంట్). 4.
1929 లాహోర్ సమావేశం: జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన చారిత్రక 'పూర్ణ స్వరాజ్' తీర్మానం ఆమోదించబడింది; 1930 జనవరి 26న మొదటి స్వాతంత్ర్య దినంగా పాటించారు. 5.
1931 కరాచీ సమావేశం: వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కులు మరియు జాతీయ ఆర్థిక విధానంపై తీర్మానం చేశారు.
