మధ్య రాతియుగంలోనే జంతువులను మచ్చిక చేసుకోవడం (Domestication of animals) ప్రారంభమైంది. మధ్యప్రదేశ్లోని ఆదంగఢ్, రాజస్థాన్లోని బాగోర్ లలో జంతువుల మచ్చికకు సంబంధించి అత్యంత ప్రాచీన ఆధారాలు లభించాయి.
మానవులను క్రమపద్ధతిలో ఖననం చేసే ఆచారం ప్రారంభమైంది; ఉత్తరప్రదేశ్లోని సరాయ్ నహర్ రాయ్, మహదహా, దమ్దమా సైట్లలో సమాధులలో పూడ్చిన అస్తిపంజరాలు, ఎముక ఆభరణాలు మరియు జంతు మాంసం వంటి ఆధారాలు పరలోక విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి.
