మధ్యప్రదేశ్లోని రాయ్సేన్ జిల్లాలో ఉన్న భీంబేట్కా గుహలను 1957లో వి.ఎస్. వాకంకర్ కనుగొన్నారు. ఇక్కడి రాతి చిత్రాలలో పచ్చ, ఎరుపు రంగులను ఉపయోగించి వేట, నాట్యం, సామూహిక విందులను చిత్రించారు. భీంబేట్కా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం.
బాగోర్ భారతదేశంలోనే అతిపెద్ద మధ్యరాతియుగ కేంద్రం. లంఘ్నాజ్ (గుజరాత్) లో మట్టిపాత్రల తొలి జాడలు మరియు మానవ సమాధులు లభించాయి.
