'గోత్రం' అనే పదం మొదట గోవుల ఉమ్మడి నివాస స్థలాన్ని సూచించగా, మలి వేద కాలంలో ఒకే మూలపురుషుడి సంతతిని సూచించే రక్తసంబంధ వ్యవస్థగా మారింది; సగోత్ర వివాహాలు నిషేధించబడ్డాయి. మానవ జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి నాలుగు ఆశ్రమాలను ఏర్పరిచారు: 1.
బ్రహ్మచర్యం (విద్యార్థి దశ) 2. గృహస్థం (వివాహం, సంసారం) 3. వానప్రస్థం (అడవులకు ఏకాంత ప్రస్థానం) 4. సన్యాసం (సర్వసంగ పరిత్యాగం). ఈ నాలుగు ఆశ్రమాల ప్రస్తావన తొలిసారిగా జాబాల ఉపనిషత్తులో లభిస్తుంది.
