మలి వేద సమాజంలో మహిళల స్థితిగతులు గణనీయంగా దిగజారాయి. ఉపనయన సంస్కారం, సభలలో పాల్గొనే హక్కులు రద్దయ్యాయి. ఐతరేయ బ్రాహ్మణం 'కుమార్తెను అన్ని దుఃఖాలకు మూలమని, కుమారుడు కుటుంబ రక్షకుడని' పేర్కొంది.
మైత్రాయణి సంహిత స్త్రీని సుర (మద్యం), పాచికలతో (జూదం) సమానమైన మూడవ చెడుగా వర్ణించింది. బహుభార్యత్వాచారం పెరిగింది.
అయితే బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షితో శాస్త్రవాదానికి దిగిన గార్గి, మైత్రేయి వంటి కొద్దిమంది విద్యావంతులైన స్త్రీలు మినహాయింపుగా కనిపిస్తారు.
