సింధు ఆర్థిక వ్యవస్థ విదేశీ వాణిజ్యంపై ఆధారపడింది. మెసొపొటేమియా సుమేరియన్ శాసనాలు హరప్పా ప్రాంతాన్ని 'మెలూహా' (Meluhha) అని పేర్కొన్నాయి. వాణిజ్యంలో మధ్యవర్తిత్వ కేంద్రాలుగా 'దిల్మున్' (బహ్రెయిన్), 'మకాన్' (ఒమన్ తీరం) వ్యవహరించాయి.
హరప్పా ముద్రికలు మెసొపొటేమియా నగరాలైన ఉర్, కిష్, సుసాలలో లభించాయి. వీరు విలువైన రత్నాలు, లాపిస్ లాజులీ (ఆఫ్ఘనిస్తాన్), రాగి (రాజస్థాన్లోని ఖేత్రి), బంగారం (కర్ణాటకలోని కోలార్), వెండి (పర్షియా) దిగుమతి చేసుకున్నారు.
