సింధు నాగరికతలోని అత్యధిక స్థావరాలు సరస్వతి (ఘగ్గర్-హక్రా) నదీ పరివాహక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి. అందువల్ల కొందరు చరిత్రకారులు దీనిని 'సింధు-సరస్వతి నాగరికత' అని పిలుస్తారు.
మొహెంజొదారో సింధు నాగరికతలో అతిపెద్ద నగరంగా పరిగణించబడగా, భారతదేశ సరిహద్దుల్లో హర్యానాలోని రాఖీగర్హీ అతిపెద్ద సైట్గా నిలిచింది. ధోలావీరా, ఖాలీబంగన్, లోథాల్, చన్హుదారో ఇతర ప్రధాన కేంద్రాలు.
ఇవి నదీ పరీవాహక ప్రాంతాల్లో అంతర్జాతీయ వాణిజ్య మార్గాలతో అనుసంధానమై ఉన్నాయి.
