క్రీ.పూ. 322లో చంద్రగుప్త మౌర్యుడు తన గురువు మరియు ప్రధానమంత్రి అయిన చాణక్యుని (విష్ణుగుప్తుడు/కౌటిల్యుడు) వ్యూహాత్మక సహాయంతో చివరి నంద రాజైన ధననందుడిని వధించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా సువిశాల అఖిల భారత కేంద్రీకృత సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనత చంద్రగుప్తునికే దక్కుతుంది.
గ్రీకు రచయితలు ఇతడిని 'శాండ్రోకోటస్' (స్ట్రాబో, జస్టిన్), 'ఆండ్రోకోటస్' (ప్లూటార్క్) అని పేర్కొన్నారు; 1793లో సర్ విలియం జోన్స్ శాండ్రోకోటస్ అంటే చంద్రగుప్త మౌర్యుడేనని నిరూపించారు.
