పర్షియన్ల ప్రభావం వల్ల వాయవ్య భారతదేశంలో కుడి నుండి ఎడమకు రాసే 'ఖరోష్టీ లిపి' ప్రవేశపెట్టబడింది. మౌర్యుల రాతి స్తంభాల మెరుగు, గంట ఆకారపు బోధికలపై పర్షియన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
అలెగ్జాండర్ రాక భారతదేశంలో కచ్చితమైన చారిత్రక కాలగణన (Chronology) నిర్ణయానికి ఆధారం అందించింది. తదనంతర కాలంలో గ్రీకు-భారతీయ శిల్పకళా సమ్మేళనంతో 'గాంధార శిల్పకళ' ఆవిర్భవించింది.
