మిళిందపన్హా (గ్రీకు రాజు మీనాండర్ మరియు బౌద్ధ సన్యాసి నాగసేనుడి సంభాషణ) ప్రముఖ బౌద్ధ గ్రంథం. అశ్వఘోషుడు సంస్కృతంలో బుద్ధచరితం, సౌందరనందం రచించాడు. నాగార్జునుడు మాధ్యమిక శూన్యవాదాన్ని ప్రతిపాదించి 'రెండవ బుద్ధుడు'గా పేరొందాడు.
గుప్తుల కాలంలో కుమారగుప్తుడు-1 నలంద విశ్వవిద్యాలయాన్ని, పాల వంశపు ధర్మపాలుడు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
