ఋగ్వేద ఆర్థిక వ్యవస్థ ప్రాథమికంగా పశుపోషక (Pastoral) వ్యవస్థ; వ్యవసాయం ద్వితీయ స్థానంలో ఉండేది. వీరి ప్రధాన సంపద ఆవులు (గోవు). యుద్ధాలను 'గవిష్టి' (ఆవుల కోసం అన్వేషణ) అనేవారు. ఆవును 'అఘన్య' (చంపకూడనిది)గా పరిగణించారు.
దూరాలను 'గోవ్యుతి' అని, కాలాన్ని 'గోధూళి' అని కొలిచేవారు. భూమిపై వ్యక్తిగత యాజమాన్యం లేదు, తెగ ఉమ్మడి ఆస్తిగా ఉండేది. వ్యాపారం వస్తుమార్పిడి పద్ధతిలో సాగేది; పెద్ద లావాదేవీలలో ఆవులు మరియు 'నిష్క' (బంగారు ఆభరణం) ప్రమాణాలుగా వాడారు.
