చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ ('యాత్రికుల రారాజు' / ప్రిన్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్) క్రీ.శ. 629-645 మధ్య హర్షవర్ధనుని కాలంలో భారత్ను సందర్శించాడు; ఇతని పర్యటన గ్రంథం 'సి-యు-కి' (పాశ్చాత్య ప్రపంచ రికార్డులు) సమకాలీన భారతదేశాన్ని వర్ణిస్తుంది.
హర్షుడు తొలుత శైవుడైనప్పటికీ, హ్యూయెన్ త్సాంగ్ ప్రభావంతో మహాయాన బౌద్ధాన్ని స్వీకరించాడు. క్రీ.శ. 643లో కనౌజ్ లో 20 దేశాల రాజులతో సర్వమత మహాసభను నిర్వహించి హ్యూయెన్ త్సాంగ్ను సత్కరించాడు.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రయాగ (అలహాబాద్) సంగమం వద్ద 'మహా మోక్ష పరిషత్' నిర్వహించి సర్వస్వాన్ని దానం చేసేవాడు.
